‘త్రీ ఇడియట్స్‌’ సీన్ రిపీట్.. బైక్‌పై రోగితో ఎమర్జెన్సీ వార్డుకు!

-

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌ నటించిన మూవీ ‘త్రీ ఇడియట్స్‌’ గుర్తుంది కదా. అందులో తన స్నేహితుడి తండ్రిని ఆస్పత్రికి బైక్ పై తీసుకెళ్లే సీన్ ఉంటుంది కదా. అలాంటి దృశ్యమే మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఆవిష్కృతం అయింది. అనారోగ్యంగా ఉన్న తన తాతను ఓ యువకుడు బైక్ పై ఎక్కించుకొని నేరుగా ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డు వరకు వెళ్లాడు. ఇది చూసి అక్కడున్నవారంతా కాసేపు అవాక్కయ్యారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

నీరజ్‌ గుప్తా అనే యువకుడి తాత శనివారం రాత్రి అనారోగ్యానికి గురయ్యారు. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మరో వ్యక్తి సాయంతో తాతను ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకున్న గుప్తా.. స్థానిక సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ జిల్లా ఆస్పత్రికి చేరుకున్నాడు. ద్విచక్ర వాహనాన్ని నేరుగా ఎమర్జెన్సీ వార్డు వరకు తీసుకురావడం చూసి అవాక్కైనవారంతా షాకయ్యారు. కాసేపటికి తేరుకొని రోగిని కిందికి దించారు. ఈ వ్యవహారంపై ఆస్పత్రి వైద్యులు నీరజ్‌గుప్తాను మందలించారు.

Read more RELATED
Recommended to you

Latest news