‘చుప్.. సైలెంట్‌గా ఉండకపోతే.. మీ ఇంటికి ఈడీ వస్తుంది’ : కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి

-

విపక్ష నేతలు సైలెంట్​గా ఉండకపోతే.. వారి ఇంటికి ఈడీ వస్తుందంటూ కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పార్లమెంట్ సాక్షిగా హెచ్చరించారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్​ అవుతోంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై లోక్ సభలో చర్చ జరిగిన సమయంలో మీనాక్షి ఈ వ్యాఖ్యలు చేశారు.

‘దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’పై లోక్‌సభలో చర్చ జరుగుతుండగా.. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. అధికార పక్ష సభ్యులు మాట్లాడుతుండగా విపక్ష ఎంపీలు గట్టిగట్టిగా నినాదాలు చేశారు. దీనిపై మీనాక్షి లేఖి స్పందిస్తూ.. ‘‘నిశ్శబ్దంగా ఉండండి. లేదంటే మీ ఇళ్లకు ఈడీ అధికారులు రావాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. అనంతరం ఈ బిల్లును సమర్థిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై పరోక్షంగా లేఖి ఘాటు విమర్శలు చేశారు. ఆయన ‘పావు వంతు సీఎం’ అని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news