మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఇంట తీవ్ర విషాదం… కుమారుడి మృతి

-

మైకోసాఫ్ట సీఈఓ సత్య నాదేళ్ల ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సత్య నాదేళ్ల కుమారుడు 26 ఏళ్ల జైన్ మృతి చెందాడు. పుట్టినప్పటి నుంచి సెరెబ్రెల్ పల్సి వ్యాధితో బాధపడుతున్న జైన్ సోమవారం ఉదయం ప్రాణాలు వదిలాడు. ఈ విషయాన్ని సత్య నాదెళ్ల తన ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ కు మెయిల్ ద్వారా తెలియజేశారు. 

2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. భారత దేశం నుంచి ఈ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. మైక్రోసాఫ్ట్ మెరుగైన సేవలు అందించేందుకు తనవంతుగా సత్య నాదెళ్ల పని చేశారు. ఇదిలా ఉంటే పలు సందర్భాల్లో తన కొడుకు జైన్ ఆరోగ్య పరిస్థితిని కూడా వివరించారు. జైన్ ను పెంచుతూ తాను నేర్చుకున్న పాఠాలను పలు సందర్భాల్లో ఉదహరించారు. జైన్ తన ఎక్కువ భాగం చిల్డ్రన్స్ హాస్పిటల్ లోనే చికిత్స తీసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news