కంగనా రనౌత్ వ్యాఖ్యలపై మోదీ క్లారిటీ ఇవ్వాలి – రాహుల్ గాంధీ

-

బిజెపి ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ట్విట్టర్ వేదికగా రాహుల్ మాట్లాడుతూ.. రైతులకు వ్యతిరేకంగా బిజెపి ఏ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ మళ్లీ క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని అన్నారు. సాగు చట్టాలను తిరిగి తీసుకురావాలని ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై మోడీ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ.

ప్రభుత్వ విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు..? బిజెపి ఎంపీనా..? లేక మోదీనా..? అని ప్రశ్నించారు. 700 మందికి పైగా రైతులు, ముఖ్యంగా హర్యానా, పంజాబ్ రైతులు బలిదానాలు చేసినా బిజెపి సంతృప్తి చెందలేదని విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా బిజెపి చేసే ఏ కుట్రలను విజయవంతం చేయడానికి ఇండియా కూటమి అనుమతించదని అన్నారు.

ఇక అంతకు ముందు జమ్ములో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. పిఓకే నుంచి వచ్చిన శరణార్థులకు మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని నెరవేరుస్తామని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బయట వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే జమ్మూ కాశ్మీర్ నుంచి రాష్ట్ర హోదాను లాక్కున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news