క్రికెట్ అభిమానులకు శుభవార్త.. టీమిండియాలోకి ఎంఎస్‌ ధోనీ ఎంట్రీ!

-

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎన్నో విజయాలను టైటిల్ లను దేశానికి అందించాడు. ఆ తర్వాత దేశవాళీ లీగ్ అయినా ఐపీఎల్ లోనూ తన టీం కు టైటిల్ అందించి సక్సెస్ ఫుల్ లీడర్ గా పేరు తెచ్చుకున్నాడు.

అయితే, తాజాగా ధోని విషయంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుందట. టి20 ప్రపంచకప్ లో టీమిండియా మెంటార్ గా పనిచేసిన మాజీ కెప్టెన్ ధోని సేవలను మరోసారి వినియోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ ఏడాది స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ కు కూడా అతన్ని మెంటార్ గా నియమించాలని యోచిస్తుంది. మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీ అనుభవాన్ని ఉపయోగించుకుని వరల్డ్ కప్ సాధించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు ధోని అంగీకరించాడని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news