BREAKING : ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి ఈటల, రాజగోపాల్ రెడ్డి దూరం

-

 

ఇంటింటికీ బీజేపీ పేరుతో ఇవాళ కాషాయదళం ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ ఒక్క రోజే 35 లక్షల కుటుంబాలను కలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు… రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఒక్కొక్కరూ కనీసం వంద కుటుంబాలను కలిసేలా కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రస్థాయి నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు వెళ్లి నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు కరపత్రాలను పంపిణి చేయనున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చైతన్యపురి, విద్యానగర్ కాలనీల్లో పర్యటించనున్నారు. ఈ తరుణంలోనే బీజేపీకి ఊహించని షాక్‌ తగిలింది. ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి ఈటల, రాజగోపాల్ రెడ్డి దూరం అయ్యారు. గత కొంత కాలంగా… బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈటల, రాజగోపాల్‌ రెడ్డి.. ఇప్పుడు ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి కూడా దూరంగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news