మరో 5 ఏళ్లపాటు రిలయన్స్ హెడ్​గా ముకేశ్ అంబానీ

-

రిలయన్స్ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ ఛైర్మన్ అండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​గా ముకేశ్​ అంబానీ మరో 5 ఏళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు కంపెనీ షేర్​ హోల్డర్లు తీర్మానం చేశారు. 2029 ఏప్రిల్​ వరకు ముకేశ్​ అంబానీ రిలయన్స్ హెడ్​గా​ పనిచేయనున్నారు. ఈ సమయంలో ఆయన ఎలాంటి జీతం తీసుకోకుండా పని చేస్తానని ఆయన ప్రకటించారు.

రిలయన్స్ ఇండస్ట్రీని ముకేశ్​ అంబానీ అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్తున్నందున.. ఆయనే కంపెనీ ఛైర్మన్​ అండ్​ ఎమ్​డీగా కొనసాగించాలని షేర్ హోల్డర్లు నిర్ణయించారు. కంపెనీ లా ప్రకారం, ఒక వ్యక్తి 70 ఏళ్ల వరకు మాత్రమే ఈ పదవిలో కొనసాగగలరు. ప్రస్తుతం ముకేశ్​ అంబానీ వయస్సు 66 సంవత్సరాలు. అందుకే కంపెనీ షేర్​ హోల్డర్లు ప్రత్యేక తీర్మానం చేసి, ఆయనను 2029 ఏప్రిల్​ వరకు రిలయన్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్​గా ఎన్నుకున్నారు. ముకేశ్​​ అంబానీ ప్రస్తుత టెర్మ్​ 2024 ఏప్రిల్​ 18తో ముగుస్తుంది. అయితే 2019 ఏప్రిల్​ 19 నుంచి మరో ఐదేళ్లపాటు ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ అండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​గా కొనసాగనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news