భారత్ లో 16 వేల కొత్త కేసులు.. 49 మరణాలు..!

-

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గురువారం 3.04 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 16,561 మంది వైరస్ బారినపడ్డారు. కొద్దిరోజులుగా ఇదే స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి. పాజిటివిటీ రేటు 5.44 శాతంగా నమోదైంది.

దిల్లీలో 2,726 కేసులొచ్చాయి. అక్కడ పాజిటివిటీ రేటు 14.38 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 18,053 మంది కోలుకున్నారు. 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండేళ్ల కాలంలో 4.42 కోట్ల మందికి మహమ్మారి సోకగా.. 98.53 శాతం మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల కేసులు 1.23 లక్షల(0.28 శాతం)కు తగ్గాయి. గత ఏడాది ప్రారంభం నుంచి 207 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ కాగా.. అందులో నిన్న 17.7 లక్షల మంది టీకా వేయించుకున్నారని శుక్రవారం కేంద్రం వెల్లడించింది.

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 7,70,436 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,724 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 59,29,36,079కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,45,795 మంది మరణించారు. ఒక్కరోజే 9,68,940 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 56,48,72,103కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news