BSFతో One India కీలక ఒప్పందం

-

ప్రముఖ డిజిటల్ న్యూస్ సంస్థ వన్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశం కోసం పోరాడుతున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తో కీలక ఒప్పందం చేసుకుంది వన్ ఇండియా సంస్థ. దేశం కోసం చివరి శ్వాస వరకు పోరాటం చేసిన సైనికుల చరిత్రను నేటి యువత ముందుకు తీసుకువచ్చే మహోన్నత కార్యక్రమానికి… శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే కీలక ఒప్పందం చేసుకున్నారు.

OneIndia Partners With BSF To Honour India’s Bravest:A Digital Tribute to Guardians of Our Borders
OneIndia Partners With BSF To Honour India’s Bravest:A Digital Tribute to Guardians of Our Borders

నేటి యువతతో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకువస్తున్నారు. 1947 కు ముందు నుంచి నేటి డిజిటల్ యుగం వరకు శత్రువు ఎన్నో రకాలుగా ముసుగులు ధరించి దేశంపై దాడి చేసినప్పటికీ.. ఇండియన్ ఆర్మీ మాత్రం… ఎక్కడా తగ్గడం లేదు. కానీ ఆర్మీ సాధించిన విజయాలు మాత్రం యువతకు తెలియడం లేదు.

ఈ నేపథ్యంలోనే మరుగున పడిన సైనికుల జీవిత విశేషాలు అలాగే వాళ్ళు చేస్తున్న పోరాటాలను వెలికి తీసేందుకు వన్ ఇండియా ముందుకు వచ్చింది. డిజిటల్ మీడియా ద్వారా యువతకు వాళ్ల సాహసాలు అలాగే త్యాగాలను తెలియజేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే బిఎస్ఎఫ్ తో ఒప్పందం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news