అయోధ్య ప్రాణప్రతిష్ఠ వీడియో షేర్‌ చేసిన మోదీ

-

దాశరథ తనయుడి జన్మస్థలమైన అయోధ్యలో నిర్మించిన భవ్య మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. 500 ఏళ్ల నుంచి కోట్ల మంది హిందువులు వేయి కళ్లతో ఎదురుచూసిన అపూరుప ఘట్టాన్ని వారంతా తమ మనసుతో తిలకించారు. ఈ సందర్భంగా అయోధ్యకు తరలివచ్చిన రామభక్తులంతా ప్రత్యక్షంగా చూసి తరించగా.. టీవీల ముందు కోట్ల మంది శ్రీరాఘవుడి భక్తులు పరోక్షంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠను చూసి తరించారు. అయితే ఆ అపురూప క్షణాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రోజున తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశారు.

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వీడియోను షేర్ చేసిన మోదీ అద్భుతమైన క్యాప్షన్ను ఆ వీడియోకు జోడించారు. ‘‘అయోధ్యలో జనవరి 22వ తేదీన మనం చూసిన దృశ్యాలు.. చాలా ఏళ్ల పాటు మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి’’ అని ఆయన వీడియో కింద రాసుకొచ్చారు. ఆ అద్భుత ఘట్టాన్ని గుర్తు చేసుకుని ప్రధాని మోదీ మరోసారి తరించిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news