బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసు.. సెప్టిక్‌ ట్యాంకులో మాంసం ముద్దలు!

-

బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ (53) కోల్‌కతాలో ఇటీవల దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఆయన హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న అపార్ట్‌మెంట్‌లోని సెప్టిక్‌ ట్యాంక్‌లో బెంగాల్‌ సీఐడీ దర్యాప్తు బృందాలు తాజాగా మాంసపు ముద్దలు గుర్తించాయి. కేసు దర్యాప్తులో భాగంగా ఆయన హత్యకు గురైన ఫ్లాట్‌లోని బాత్‌రూమ్‌ ద్వారా రక్తం మురుగునీటి పైపులగుండా వెళ్లినట్లు భావించామని పోలీసు అధికారి తెలిపారు.

హౌసింగ్‌ కాంప్లెక్స్‌ బాధ్యుల సాయంతో ఆ మురుగునీటి పైపులైన్లు, సెప్టిక్‌ ట్యాంకును పరిశీలించగా.. మాంసపు ముద్దలను గుర్తించినట్లు తెలిపారు. మొత్తం మూడున్నర కిలోల మాంసం ముద్దలు, కొన్ని వెంట్రుకలు సెప్టిక్‌ ట్యాంక్‌లో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించామని, డీఎన్‌ఏ పరీక్షల్లో ఆ శరీర భాగాలు అనర్‌కు చెందినవో కావో తెలుస్తాయని అన్నారు.

 

బంగ్లాదేశ్‌ అధికార పార్టీ అవామీ లీగ్‌కు చెందిన ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ వైద్య చికిత్స కోసం ఈ నెల 12న కోల్‌కతా వచ్చారు. తన స్నేహితుడికి చెందిన అపార్ట్‌మెంట్‌లో బస చేసిన ఆయన.. కొన్నిరోజుల తర్వాత నుంచి కనిపించకుండా పోవడంతో రంగంలోకి దిగిన కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓ మహిళ సాయంతో నిందితులు ఆయనను హనీట్రాప్‌లోకి దింపి, ఆయన బస చేసిన అపార్ట్‌మెంట్‌లోనే గొంతు నులుమి హత్యచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news