బీహార్ వరదల్లో ముంచెత్తుతున్న రాజకీయ విమర్శలు…!

-

ఉత్తర, ఈశాన్య భారతదేశంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి బిహార్​, అసోం, మేఘాలయల్లో ఇప్పటి వరకు సుమారు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలు కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా వచ్చే కేరళలో రెడ్​ అలర్ట్​ ప్రకటించింది భారత వాతావరణ విభాగం.నదులు ఉగ్రరూపం దాల్చడం వల్ల బీహార్ లో తోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. 14 జిల్లాల్లోని 1012 గ్రామాల్లో 45.39 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారు.

tejaswi yadv
tejaswi yadv

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షాలకు ఇదొక అంశంగా దొరికినట్లయింది. వరదల కారణంగా తూర్పు చంపారన్​ జిల్లాలో ప్రజలు నిలువు నీడలేకుండా ఇబ్బందులు పడుతుంటే.. కేవలం 19 పునరావాస కేంద్రాలే ఏర్పాటు చేయడంపై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్​ అసహనం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఈ వరదలు మరింత ఇబ్బందిగా మారింది. దీని వలన కరోనా భారిన ఎక్కువ మందికి సోకుతుందని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news