బ్రేకింగ్: అంధకారంలో ముంబై నగరం

-

టాటా ఇన్కమింగ్ విద్యుత్ సరఫరా వైఫల్యం కారణంగా ముంబైలో విద్యుత్ సరఫరా అంతరాయం కలిగింది. బృహన్ ముంబై కార్పోరేషన్ ప్రకటన చేసింది. మహారాష్ట్ర గ్రిడ్ వైఫల్యం కారణంగా ముంబై సబర్బన్ రైలు సర్వీసులు దెబ్బతిన్నాయని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ (సిపిఆర్ఓ) పేర్కొన్నారు. పలు పరిశ్రమలు కూడా నిలిచిపోయాయి.

చిన్న చిన్న వ్యాపారాలు కూడా మూత పడ్డాయి. అయితే సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది అనేది ఇంకా ప్రకటించలేదు. దాదాపు గా ముంబై మొత్తం అంధకారంలోనే ఉంది. రైళ్ళ రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడటంతో ఆటోల్లో, బస్సుల్లో ముంబై వాసులు ప్రయాణం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news