గంజాయి మత్తులో యువకుల హల్‌చల్..అంబర్‌పేటలో బీభత్సం.

-

హైదరాబాద్‌లో గంజాయి మత్తులో  యువకులు రోడ్డుపై హల్‌చల్ చేస్తున్నారు..పాదచారులను అటకాయిస్తూ దాడికి పాల్పడుతున్నారు..ముఖ్యంగా నగరం నడిబొడ్డు అంబర్‌పేటలోని అలీ కేఫ్ సమీపంలో రోడ్డుపై అర్థరాత్రిల్లో వీరంగం సృష్టిస్తున్నారు..ఆ దారిన వెళుతున్న వారిపై రాళ్లతో దాడులకు తెగబడుతున్నారు..వారి దగ్గరి నుంచి డబ్బు, సెల్ ఫోన్స్‌ లాకుంటు బీభత్సం సృష్టిస్తున్నారు..దుండగుల ఆగడాలు మితిమీరిపోవడంతో ఆ దారిలో వెళ్లాలంటే జనం భయపడుతున్నారు..గంజాయ్‌ మత్తులో వీరు సృష్టిస్తున్నహంగామా వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి..అకతాయులు చేస్తున్న అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ స్థానికుల ఆందోళన చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news