ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది – ప్రధాని మోడీ

-

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదంటూ దేశ ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటపై 77వ స్వాతంత్ర్య వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే రాజ్‌ఘాట్‌ దగ్గర నివాళులర్పించిన ప్రధాని మోడీ…అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

10వ సారి జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ…కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదంటూ వ్యాఖ్యానించారు. దేశం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని వెల్లడించారు. అమరవీరుల త్యాగఫలితమే స్వాతంత్ర్యం అని స్పష్టం చేశారు ప్రధాని మోడీ.ఇక తమ పాలనలో.. రైతుల కోసం కిసాన్‌ సమ్మాన్‌ నిధి అమలు చేస్తున్నామని.. ఎరువులను సబ్సిడీపై అందిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే వందే భారత్‌ ట్రైన్స్‌ తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news