IPL 2023 : రేపే క్వాలిఫయర్-2 మ్యాచ్.. ఫైనల్‌కు ముంబై వెళుతుందా ?

-

అహ్మదాబాద్ లో రేపు గుజరాత్, ముంబై మధ్య క్వాలిఫైయర్-2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో చెన్నైతో తలపడుతుంది. క్వాలిఫైయర్-1లో ఓడిన GT క్వాలిఫైయర్-2లో గెలిచి, ఎలాగైనా ఫైనల్ కు చేరాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ముంబై GTని ఓడించి ఫైనల్ లో చెన్నైపై గెలుపొంది మరోసారి ఛాంపియన్ గా నిలవాలని భావిస్తుంది.

కాగా, ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోపై ముంబై 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో… స్టోయినిస్ 40 మినహా మిగతా బ్యాటర్లు విఫలం అవడంతో 101 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ముంబై బౌలర్ల లో మద్వాల్ 5 వికెట్లు, జోర్డాన్, పియూష్ చేరో వికెట్ తీశారు. లక్నోలో ముగ్గురు బాటర్లు రన్ అవుట్ అయ్యారు. ఈ విజయం తో ముంబై క్వాలి ఫైయర్ – 2 లో గుజరాత్ తో తల పడునుంది. ఓటమిపాలైన లక్నో ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించింది.

Read more RELATED
Recommended to you

Latest news