రాహుల్ గాంధీకి మధ్యంతర బెయిల్ మంజూరు

-

పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ సెషన్స్ కోర్ట్ సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేసింది. దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వం పై విధించిన సస్పెన్షన్ కొనసాగనుంది.

కాగా నేటి విచారణకు రాహుల్ గాంధీ తన సోదరీ ప్రియాంక గాంధీతో కలిసి వచ్చారు. దొంగలందరికీ మోడీ అనే ఇంటి పేరే ఉంటుంది అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయగా.. గుజరాత్ బిజెపి ఎమ్మెల్యే, న్యాయవాది పూర్ణేష్ మోదీ పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులోనే రాహుల్ కు జైలు శిక్ష పడింది.

Read more RELATED
Recommended to you

Latest news