ఎండ వేడిమికి కరిగిన రైలు పట్టాలు.. నీలాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

-

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను ఎండ వేడిమి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండ ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వడగాలుల కారణంగా వందల మంది మృత్యువాత పడుతున్నారు. కేవలం మనుషులు, పశుపక్ష్యాదులే కాదు.. ఈ వేడికి తట్టుకోలేక ఏకంగా రైలు పట్టాలే కరిగిపోయాయి. యూపీలోని లక్నో వద్ద నిగోహన్‌ రైల్వే స్టేషన్‌ వద్ద శనివారం సాయంత్రం లూప్‌ లైన్‌ మీదకు నీలాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రాగా, మెత్తబడిన రైలు పట్టాలు పక్కకు జరిగాయి. రైలు తీవ్రమైన కుదుపులకు లోనైంది. లోకో పైలట్‌ అప్రమత్తతతో రైలును వెంటనే నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అక్కడి రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పట్టాలు పక్కకు జరిగిన విషయాన్ని లోకో పైలట్‌ గుర్తించకుంటే, ఒడిశా బాలాసోర్‌లో జరిగినట్టు మరో రైలు దుర్ఘటన జరిగి ఉండేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. రైల్వే ట్రాక్‌ నిర్వహణ సరిగా లేక అనేక రైళ్లు పట్టాలు తప్పుతున్నా, కేంద్రం దీనిపై దృష్టిపెట్టడం లేదన్న విమర్శలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news