30 మంది కాంగ్రెస్ నేతలు గెలిచేందుకు.. సీఎం కేసీఆర్ ఫండ్ ఇచ్చాడు – బండి సంజయ్

-

 

30 మంది కాంగ్రెస్ నేతలు గెలిచేందుకు.. సీఎం కేసీఆర్ ఫండ్ ఇచ్చాడని సంచలన ఆరోపణ చేశారు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. ఈ నెల 25న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభ జరుగనుందని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ నాగర్ కర్నూల్ జిల్లాలో జరుగనుంది.

ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్ల పై సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మోసపూరిత హామీలే.. తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన వారు జైలుకు పొక తప్పదని హెచ్చరించారు.

ఇక్కడ KCR దుకాణం మూసి కొత్త దుకాణం ఓపెన్ చేసిండు.. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మందిని కేసీఆర్ సెలక్ట్ చేసిండు.. వారికి పార్టీ ఫండ్ కింద కోట్ల రూపాయలు ఇస్తుండని ఆరోపణలు చేశారు. కేసిఆర్… బిఆర్ఎస్ అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలని కోరుకుంటాడు.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని జాకి పెట్టి లేపిన లేవదని ఏద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కి అభ్యర్థులు కరువయ్యారు..కమలం గుర్తుపై పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎక్కువయ్యారన్నారు.  రాబోయేది పేదల రాజ్యం రామ రాజ్యమే… ఎన్నికల్లో బిజెపి పార్టీ సింహం సింగిల్గా వస్తది గుంట నక్కలు గుంపులు గుంపులుగా వస్తారని చురకలు అంటించారు బండి సంజయ్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news