కేజ్రీ వాల్ కి వరుస సమన్లు.. ఆప్ స్పందన ఇదే..!

-

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. రెండు వేర్వేరు కేసుల్లో కేజీవాల్కు సమన్లు జారీ చేసింది. మొదట ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తొమ్మిదో సారి సమన్లు పంపిన ఈడీ 21న విచారణకు రావాలని ఆదేశించింది. అలాగే ఢిల్లీ జల్ బోర్డులో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కూడా నోటీసులు పంపింది. ఈ కేసులో మార్చి 18(సోమవారం) ఇన్వెస్టిగేషన్కు రావాలని తెలిపింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే 8 సమన్లను కేజీవాల్ తిరస్కరించి విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కేజీవాల్ శనివారం విచారణకు హాజరయ్యారు. వెంటనే రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో హాజరు నుంచి కేజీవాల్కు మినహాయింపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈడీ మరోసారి సమన్లు జారీ చేయడం గమనార్హం.

ఇక, ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించిన కేసులో టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) 2022 జూలైలో కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపడుతోంది. విచారణలో భాగంగా ఫిబ్రవరిలో కేజ్రివాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్, ఆప్ ఎంపీ ఎన్డీ గుప్తా, ఢిల్లీ జల్ బోర్డు మాజీ సభ్యుడు శలభ్ కుమార్, పంకజ్ మంగళ్లపై ఈడీ దాడులు చేసింది. దీంతో తాజాగా కేజీవాల్ను విచారణకు పిలిచింది. అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే కేజీవాలు ఈడీ సమన్లు పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news