BREAKING : ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు దుర్మరణం

-

ఇటీవల ఉత్తర్ ప్రదేశ్లో తొక్కిసలాట ఘటన మరవకముందే మరో ఆలయంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. బిహార్‌లోని జెహానాబాద్‌ జిల్లా మగ్ధుంపూర్‌లోని బాబా సిద్ధనాథ్‌ ఆలయంలో ఈ ప్రమాదం జరిగింది. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్లోని మగ్ధుంపూర్‌లోని బాబా సిద్ధనాథ్‌ ఆలయంలో  తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. భక్తులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కూడా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మృతుల వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సంఘటనా స్థలిని జెహానాబాద్‌ డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌ అలంకృత పాండే పరిశీలించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాయని చెప్పారు. అయితే ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news