TokyoParalympics : భారత్ ఖాతాలో మరో గోల్డ్, సిల్వర్

-

టోక్యో పారా లింపిక్స్ క్రీడల్లో భారత క్రీడాకారులు తమ జోరు కొనసాగిస్తున్నారు. దీంతో భారత్ కు వరుసగా పతకాలు వస్తున్నాయి. ఇప్పటికే 13 పతకాలు భారత్ సాధించగా తాజాగా మరో రెండు పతకాలు వచ్చాయి. షూటింగ్ విభాగం లో ఇండియా కు ఓ గోల్డ్ మరియు సిల్వర్ పతకం వరించింది.

షూటింగ్ P4 మిక్స్‌డ్ 50 మీ పిస్టల్ SH1 విభాగం లో మనీష్ నర్వాల్ స్వర్ణం గెలుచు కోగా.. సింఘ రాజ్ వెండి పతాకాన్ని గెలుచు కున్నాడు. దీంతో ఇండియా పతకాల సంఖ్య 15 కు చేరింది.  ఇక అటు భారత బ్యాడ్మింటన్ స్టార్ సుహాస్ యతిరాజ్ కూడా బ్యాడ్మింటన్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు. Sl -4 కేటగిరీలో భారత స్టార్ ప్లేయర్ సుహాస్.. ఇండోనేషియా ప్లేయర్ ఆర్.సి రెడ్డి పై వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్ లోకి దూసుకెళ్లాడు. దీంతో భారత్ కి కనీసం మరో రజతాన్ని ఖాయం చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news