BREAKING : బేబీ కేర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఆరుగురు శిశువులు మృతి

-

దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న బేబీ కేర్ ఆస్పత్రిలో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు నవజాత శిశువులు మరణించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఫైర్ సర్వీస్ కంట్రోల్ రూమ్కి బేబీ కేర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగిన్నట్లు రాత్రి 11:30 గంటలకు ఫోన్ వచ్చిందని అధికారి రాజేశ్ తెలిపారు. వెంటనే 16 అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలికి చేరుకున్నామని వెల్లడించారు. దాదాపు గంటసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చామని.. రెండు భవనాలు ఒకటి ఆస్పత్రి, మరోకటి పక్కనే ఉన్న భవనం పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. 12 మందిని రక్షించి వారిని ఆస్పత్రికి తరలించామని వివరించారు. పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాజేశ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version