ట్విట్టర్ లో #SouthKicksOutBJP ట్రెండింగ్

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అఖండ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇవాళ కర్ణాటక కాంగ్రెస్ లో‌ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు CLP సమావేశం జరుగనుంది. ఈ తరుణంలో బెంగుళూరు చేరుకుంటున్నారు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మల్లికార్జున ఖర్గే, KC వేణుగోపాల్, సూర్జేవాల ల సమక్షం లో CLP సమావేశం జరుగనుంది.

ఇక అటు కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో బిజెపిని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. #SouthKicksOutBJP (బిజెపిని సౌత్ తరిమికొట్టింది) హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ‘బజరంగ్ బళీ, కేరళ స్టోరీ, కాంగ్రెస్ టెర్రరిస్టులకు లొంగిపోయింది. కర్ణాటకను ఇండియా నుంచి విడగొట్టాలనుకున్నారు’ అంటూ మోడీ చేసిన ప్రసంగాలు బిజెపిని కాపాడలేకపోయాయని కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news