బీజేపీలో చేరిన మాండ్య ఎంపీ సుమలత అంబరీష్‌

-

సీనియర్‌ నటి, మాండ్య నియోజ‌క‌వ‌ర్గ స్వతంత్య్ర అభ్యర్థి ఎంపీ సుమ‌ల‌త అంబ‌రీష్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇవాళ ఉదయం కర్ణాటక రాజధాని బెంగళూరులో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  తాను బీజేపీలో చేరనున్నట్లు ఇటీవలే సుమలత ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ, జేడీఎస్ ద‌ళానికి స‌పోర్టు ఇవ్వనున్నట్లు చెప్పారు.

మాండ్యాను తాను విడిచిపెట్టడం లేద‌ని, రాబోయే రోజుల్లో తాను ప‌ని చేయ‌డం చూస్తార‌ని, బీజేపీలో చేర‌డానికి డిసైడ్ అయిన‌ట్లు సుమ‌ల‌త ఇటీవల అన్నారు. 2019 నాటి ఎన్నిక‌ల్లో బీజేపీ మ‌ద్దతుతో కుమార‌స్వామి కుమారుడు నిఖిల్‌పై సుమ‌ల‌త విజ‌యం సాధించారు.

సీట్ షేరింగ్ ఫార్ములా ప్రకారం.. క‌ర్ణాట‌క‌లో బీజేపీ 25 స్థానాల్లో, జేడీఎస్ మూడు చోట్ల పోటీ చేస్తోంది. ఈసారి మాండ్య నుంచి జేడీఎస్ పోటీలో నిల‌బ‌డ‌నుంది. తాను స్వతంత్య్ర ఎంపీగా ఉన్నా.. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు మాండ్య లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి 4 వేల కోట్ల నిధుల్ని రిలీజ్ చేసిన‌ట్లు సుమ‌ల‌త వెల్లడించారు. బీజేపీ నుంచి రాజ్యస‌భ‌కు సుమల‌త వెళ్లే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news