సర్కార్ కొలువులకు ఇద్దరు పిల్లల నిబంధన.. సమర్థించిన సుప్రీంకోర్టు

-

ప్రభుత్వ ఉద్యోగాలకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు అనర్హులను రాజస్థాన్ ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం తీసుకొచ్చిన నిబంధనను తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది. ఇందులో ఎలాంటి వివక్ష గానీ, రాజ్యాంగ ఉల్లంఘన గానీ లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు దీన్ని సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

రాజస్థాన్‌కు చెందిన రామ్‌జీ లాల్‌ జాట్‌ గతంలో సైన్యంలో పనిచేసి 2017లో పదవీ విరమణ పొందిన అనంతరం కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం 2018లో దరఖాస్తు చేసుకున్నారు. రామ్‌జీకి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండటంతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించడంతో ఆయన కోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్‌ను 2022లో రాజస్థాన్‌ హైకోర్టు కొట్టివేసింది. ఇది విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం.. ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను సమర్థిస్తూ ఇందులో ఎలాంటి వివక్ష లేదని, కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ నిబంధన రాజ్యంగ ఉల్లంఘన కిందకు రాదని పేర్కొంటూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

Read more RELATED
Recommended to you

Latest news