గుజరాత్ లో ఘోర విషాదం.. 8నెలల పసికందుతో సహా నలుగురు మృతి

-

గుజరాత్ లోని దేవభూమి ద్వారక జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆదిత్య రోడ్డులో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుని పసికందు తో పాటు నలుగురు మృతి చెందారు. ఆదివారం ఉదయం ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుని ఇంటినిండా దట్టమైన పొగ కమ్ముకొని పోయింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న వారు లేచి చూసే సరికి ఏమైందో అర్ధం అయ్యేలోపే ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పొయారు.

ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులతో పాటు 8 నెలల చిన్నారి కూడా ఉంది. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ద్వారకా నగరంలోని ఆదిత్య రోడ్డులో ఉన్న ఇంటి మొదటి అంతస్తులో ఐదుగురు కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగినటు పోలీసు అధికారి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news