బ్రేకింగ్: భారత బలగాలపై ఉగ్రదాడి

-

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను టార్గెట్ గా చేసుకుని భారత బలగాలు ఆపరేషన్ లు నిర్వహిస్తున్నా సరే ఉగ్రవాదులు సరిహద్దుల్లో, అలాగే కాశ్మీర్ లోయలో వరుసగా కాల్పులకు దిగుతున్నారు. తాజాగా మరోసారి భారత బలగాలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి ప్రయత్నం చేసినా సరే అది సాధ్యం కాలేదు ఉగ్రవాదులకు. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని ప్రధాన పట్టణం త్రాల్ ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు ఆదివారం గ్రెనేడ్ పేల్చారు.

ఈ దాడిలో ఒక జవాన్ గాయపడ్డారు. అక్కడి నుంచి ఉగ్రవాదులు తప్పించుకునే ప్రయత్నం చేసారు. అక్కడ కాల్పులు జరిపే ప్రయత్నం చేయగా… భారత బలగాలు అప్రమత్తం కావడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారు అయ్యారు. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ లు వరుసగా జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news