బ్రేకింగ్: భారత బలగాలపై ఉగ్రదాడి… !

-

జమ్మూకాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలోని చాదురా ప్రాంతంలో గురువారం కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) పెట్రోలింగ్ పార్టీపై తెలియని ఉగ్రవాదులు దాడి చేయడంతో ఎఎస్‌ఐ ర్యాంక్ అధికారి అమరుడు అయ్యారు. ఎఎస్‌ఐ మహారాష్ట్ర నాగ్‌పూర్‌ కు చెందిన అధికారిగా ఆర్మీ పేర్కొంది. అతను కూడా ఉగ్రవాదులపై దాడికి ప్రయత్నించగా ఉగ్రవాదులు అతని ఆయుధాలను లాక్కుని పారిపోయారు.

“బుద్గాం జిల్లాలోని చాదురాలోని బడిపోరా ప్రాంతంలో ఉదయం 7.45 గంటలకు ఈ దాడి జరిగిందని చెబుతున్నారు. సిఆర్‌పిఎఫ్ జవాన్‌ లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు, సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఎఎస్‌ఐ ర్యాంక్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. అతని సర్వీస్ రైఫిల్‌ను లాక్కొని ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారని ఆ తర్వాత అధికారి ప్రాణాలు కోల్పోయారు” అని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news