బ్రేకింగ్: జమ్మూలో ఉగ్రదాది, తప్పించుకున్న ఆర్మీ

-

జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు రోజు రోజుకి ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్మీ మీద నేడు మరోసారి దాడి చేసారు ఉగ్రవాదులు. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్‌ లోని నౌగామ్‌ లో సిఆర్‌పిఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) 110 బెటాలియన్ పార్టీపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఆర్మీ బలగాలకు ఏ విధమైన గాయాలు కాలేదు అని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.

ఆ ప్రాంతానికి భారీగా బలగాలు చేరుకున్నాయి. ఈ ఘటనలో ఎంత మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు అనే దాని మీద ఆర్మీ వివరణ ఇవ్వలేదు. ఆ ప్రాంతంలో అదనపు బలగాలను ఆర్మీ అధికారులు మొహరించారు. అనుమానం ఉన్న వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాల్గొన్నారు అని తెలుస్తుంది. పూర్తి వివరాలు మీడియాకు అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news