కార్గిల్ వీరుల శౌర్యం భావితరాలకు స్ఫూర్తిదాయకం…!

-

కార్గిల్​ విజయ్​ దివస్​ సందర్భంగా 1999లో పాకిస్థాన్​పై వీరోచితంగా పోరాటం చేసిన భారత జవాన్ల ధైర్యసాహసాలను గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సైనికుల శౌర్యం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాకిస్థాన్​పై అపూర్వ విజయానికి నేటికి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. వీర జవాన్ల ధైర్య సాహసాలను గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆనాటి జవాన్ల శౌర్యం, వీరోచిత పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు.

modi
modi

కార్గిల్​ విజయ్​ దివస్​ సందర్భంగా 1999లో మన దేశాన్ని రక్షించిన మన సాయుధ దళాల ధైర్యం, ధృడ సంకల్పం గుర్తు చేసుకోవాలి. వారి శౌర్యం, పరాక్రమం భావితరాలకు స్ఫూర్తిదాయకం. జవాన్ల ధైర్యసాహసాలకు భారత్​ కృతజ్ఞతలు తెలుపుతోంది అని అన్నారు.భారత్​లోని పేదల ప్రయోజనాల దిశగా.. కీలక నిర్ణయాలకు ముందు యోచించాలని మహాత్ముడు పిలుపునిచ్చారని వాజ్​పేయీ నాడు గుర్తుచేశారు..ఆ నాడు వాజ్​పేయీ చేసిన ప్రసంగం వలన సైనికులలో ఈరోజు పోరాటం చేయడానికి నాంది పలికింది అన్నారు. అందుకే ఆ దృష్టి మొత్తం దేశ రక్షణ మీద, శత్రువుని మాతృదేశంలో అడుగుపెట్టకుండా వీరోచిత పోరాటం చేసే విధంగా ఉంది అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news