దేశంలో అన్ని రంగాలలో మహిళల పాత్ర పెరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. 15వ ఎడిషన్ రోజ్ గార్ మేళాలో 51,000 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించిన అనంతరం ఆయన ప్రసంగించారు. 90 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 10 కోట్ల మంది మహిళలు చేరారని పేర్కొన్నారు. ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. అన్ని రంగాలలో యువతకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.
మరోవైపు పహల్గామ్ దాడి గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం దేశం దు:ఖంలో ఉందని.. ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఊహించిన దానికంటే ఎక్కువ శిక్ష పడుతుందని తెలిపారు. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. మరోవైపు గ్రామ పంచాయతీలకు నిధులు అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.