అయోధ్య చేరుకోవడం నుంచి రామ్‌మందిరంను సందర్శించడం వరకూ రూట్‌ మ్యాప్ ఇదే 

-

22 జనవరి 2024న  అయోధ్య రాం మందిరం ప్రారంభించనున్నారు. రామభక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు ఇది. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉంది. మీరు కూడా రామ్ లాల్ దర్శనం కోసం అయోధ్యకు వెళ్లడానికి సిద్ధమవుతుంటే.. దీని గురించి మీ మనస్సులో చాలా ప్రశ్నలు ఉంటే, అయోధ్యకు ఎలా వెళ్లాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత రామమందిరానికి ఎలా చేరుకోవాలి? లేదా రామ్ లాలా దర్శనం ఎలా పొందాలి. ఈ సమాచారం అంతా ఈ ఆర్టికల్‌లో మీకు అందిస్తున్నాం.
Ram Mandir
Ram Mandir

అయోధ్య రైల్వే స్టేషన్ నుండి రామమందిరం ఎంత దూరంలో ఉంది?

మీరు రైలులో అయోధ్య చేరుకుంటే, రైల్వే స్టేషన్ నుండి కేవలం ఐదు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మీరు రామమందిరానికి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అంతేకాకుండా, లక్నో మరియు ఢిల్లీతో సహా అనేక ప్రధాన నగరాల నుండి అయోధ్యకు నేరుగా బస్సు సర్వీస్ ద్వారా చేరుకోవచ్చు.
అయోధ్యలో మర్యాద పురుషోత్తమ శ్రీరామ విమానాశ్రయం ఉంది. రామాలయం మరియు విమానాశ్రయం మధ్య దూరం దాదాపు 10 కి.మీ. ఇండిగో ఇక్కడ విమాన సర్వీసును ప్రారంభిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ మరియు అహ్మదాబాద్ నుండి అయోధ్యకు విమానాలు ఉన్నాయి. లక్నో, గోరఖ్‌పూర్ మరియు వారణాసి నగరాల నుండి అయోధ్యకు బస్సు లేదా రైలు ద్వారా చేరుకోవచ్చు.

రామమందిరాన్ని ఎలా సందర్శించాలి?

రాంలాలా ఆలయంలో 30 అడుగుల దూరం నుండి చూడవచ్చు. తూర్పు దిక్కు నుంచి దర్శనం కోసం భక్తులు వస్తుంటారు. సింహద్వారం గుండా వెళ్ళిన వెంటనే, రాంలాలా ముందుకు వస్తారు. రాంలాల్‌ని చూసిన తర్వాత ఎడమవైపు తిరిగాలి.. లగేజీతో పీఎఫ్‌సీ భవనం నుంచి బయటకు వెళ్తే కుబేర్ తిలా వెళ్లాలంటే పర్మిషన్ లెటర్ ఉండాలి.
మీరు హనుమాన్‌గర్హి ఆలయం, నాగేశ్వరనాథ్ ఆలయం, కనక్ భవన్, రామ్‌కి పైడి, గుప్తర్ ఘాట్, రామ్‌కోట్‌లను సందర్శించవచ్చు. హనుమాన్‌గర్హి 10వ శతాబ్దంలో నిర్మించబడిన మహాబలి హనుమంతుని ప్రసిద్ధ దేవాలయం. హనుమంతుడు అయోధ్యలో నివసిస్తూ ఉంటాడని ఈ అయోధ్యను అతనే రక్షిస్తాడనే మత విశ్వాసం ఇప్పటికీ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news