అయ్యో పాపం.. రూ.21లక్షల విలువైన టమాటా లోడ్ లారీ మిస్సింగ్..

-

టమాటా ధరల పెరుగుదలతో టమాటల దొంగలు కూడా ఎక్కువైపోయారు. ఇప్పటికే టమాటాకు సంబంధించి పలు దొంగతనాలు జరిగిన విషయం గురించి తెలుసుకున్నాం. తాజాగా ఏకంగా టమాటా లోడ్ ఉన్న లారీనే చోరీ అయింది. ఈ ఘటన రాజస్థాన్ జైపుర్ లో చోటుచేసుకుంది.

రాజస్థాన్ లోని కోలార్ లో ముగ్గురు వ్యాపారులు రూ.21లక్షల విలువైన 735 టమాటా బాక్సులను కొనుగోలు చేసి జులై 27వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఓ ప్రైవేట్ లారీలో లోడ్ చేసి..జైపూర్ కు తరలించారు. ఆ లారీ డ్రైవర్ ఫోన్ నంబర్ ఇతర వివరాలను తీసుకున్నారు. ఈ ట్రక్కు శనివారం రాత్రి 11 గంటలకు జైపూర్ కు చేరుకోవాల్సి ఉండగా.. శనివారం ఉదయం వరకూ వ్యాపారులతో టచ్ లో ఉన్న డ్రైవర్.. మధ్యాహ్నం తర్వాత ఆచూకీ లేకుండా పోయాడు. ట్రక్కుకు అమర్చిన జీపీఎస్ ట్రాకర్లో కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆందోళన చెందిన వ్యాపారులు వెంటనే కోలార్ పోలీసులను ఆశ్రయించారు. వ్యాపారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version