IND VS WI : పాండ్యా చెత్త కెప్టెన్సీ వల్లే ఓడిపోయాం..ఫ్యాన్స్ ఫైర్ !

-

మొదటి టి20 మ్యాచ్ లో గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్ లోను అదే తీరును కనబరిచింది. వెస్టిండీస్ చేతిలో ఏకంగా రెండు వికెట్ల తేడాతో టీమిండియా ఘోర ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు 18 ఓవర్లలోనే ఫినిష్ చేసింది.

18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది వెస్టిండీస్ జట్టు. అయితే..వెస్టిండీస్‌ పై రెండో టీ20లో భారత్ ఓడిపోవడంతో టీమిండియా ఫ్యాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 16వ ఓవర్లో చాహల్ కేవలం రెండు రన్స్ మాత్రమే ఇచ్చి కీలకమైన హోల్డర్, హిట్మైర్ లను అవుట్ చేశాడని… ఆ తర్వాత అతడికి బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. చాహల్ అదే జోరులో వికెట్లు తీసేవాడని అంటున్నారు. కాగా, ఏడేళ్ల తర్వాత టి20 ద్వైపాక్షిక సిరీస్ లో టీమిండియా వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news