రైల్వేజోన్‌కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు: కేంద్ర మంత్రి

-

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ విషయంలో ఏపీ సర్కార్​పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూమిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వలేదని అన్నారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను అధికారికంగా ప్రారంభించే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? జోనల్‌ప్రధాన కార్యాలయ నిర్మాణం ఎప్పటినుంచి ప్రారంభమైంది? ఎప్పటికి పూర్తవుతుంది? ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించారు? ఎంత ఉపయోగించారు? నిర్మాణం పూర్తిచేయడానికి ఎన్నిరోజులు పొడిగించారు? అని లోక్‌సభలో టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు సంబంధించిన డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) తయారైందని.. రూ.106.89 కోట్ల అంచనా వ్యయంతో జోనల్‌ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులను మంజూరు చేశామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం రూ.10 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. భూసర్వే, జోన్‌ ప్రధాన కార్యాలయ సముదాయం, రెసిడెన్షియల్‌కాలనీ, ఇతర నిర్మాణాలకు అవసరమైన లే అవుట్‌ ప్లాన్‌ తయారీ బాధ్యతలను తూర్పుకోస్తా రైల్వేజోన్‌కు అప్పగించినట్లు వెల్లడించారు.

బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైల్వే భూమి తీసుకుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దానికి బదులుగా ముడసర్లోవలో 52.2 ఎకరాల భూమిని గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైల్వేకు అప్పగించాల్సి ఉందని చెప్పారు. ఇందుకు అనువైన భూమిని ప్రభుత్వం ఇంకా గుర్తించి, రైల్వేశాఖకు అప్పగించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news