ముస్లీం మహిళల్ని రేప్ చేస్తా: ఓ స్వామీజీ సంచలనం..

-

ఉత్తర ప్రదేశ్ లో ని లక్నో లో ఓ స్వామీజీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సీతాపూర్ జిల్లా లోని ఓ మసీదు ముందే ఆయన ముస్లిం మహిళలకు ఈ హెచ్చరికలు చేశాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 2న జరిగిన ఈ ఘటన ఖైరాబాద్ పట్టణంలోని ఓ జీపులో ప్రచారం నిర్వహిస్తున్న ఓ స్వామీజీ మైకులో ప్రజలని ఉద్దేశించిమాట్లాడారు.

ఎవరైనా ముస్లిం వ్యక్తి స్థానిక మహిళలను వేధిస్తే, అప్పుడు ముస్లిం మహిళను కిడ్నాప్ చేసి బహిరంగంగా రేప్ చేస్తానని బెదిరించారు.. అక్కడ స్వామీజీ మాటలను విన్న జనం కేరింతలు కొడుతూ జైశ్రీరామ్ అంటూ అరిచారు. తనను మర్దర్ చేసేందుకు కొందరు కుట్ర పన్నారని దానికోసం 28 లక్షలు కూడా సేకరించినట్లు ఆయన ఆరోపించారు.

ఈ వీడియోను ఆల్ట్ న్యూస్ ఫౌండర్ జుబైర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ఘటన పట్ల పోలీసులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఓ సీనియర్ అధికారి విచారణ చేపడుతున్నారని, నిజ నిర్ధారణ జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటామని, సీతాపూర్ పోలీసులు తెలిపారు. ముస్లిం మహిళలను వీడియోలో హెచ్చరికలు జారీ చేసిన స్వామీజీని బజరంగ్ మునిగా గుర్తించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news