ఈ ఏడాది కూడా మోడీ దీపావ‌ళి పండ‌గ అక్క‌డే?

-

ప్ర‌తి ఏడాది దీపావ‌ళి పండుగ ను మ‌న దేశ ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడి సైనికుల తోనే జ‌రుపు కుంటారు. ఈ ఏడాది కూడా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడి దీపావ‌ళి వేడుక‌ల‌ను మ‌న దేశ సైనికుల‌తో నే జ‌రుపుకోనున్నారు. గ‌త ఏడాది దీపావ‌ళి పండుగ‌ను రాజ‌స్థాన్ లో గ‌ల జైస‌ల్మీర్ లోని లోంగేవాలా స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఉన్న సైనికులను క‌లిసి వారితో దీపావ‌ళి జ‌రుపుకున్నారు.

ఈ ఏడాది న‌రేంద్ర మోడీ దీపావ‌ళి వేడుక‌ల‌ను కాశ్మీర్ లోని నౌషేరా, రాజౌరీ సరిహ‌ద్దు ప్రాంతాల‌లో జ‌రుపుకుంటార‌ని పీఎంవో అధికారులు ఒక ప్ర‌క‌ట‌న లో తెలిపారు. అయితే న‌రేంద్ర మోడీ 2014 లో ప్ర‌ధాన మంత్రి బాధ్య‌తలు స్వీక‌రించిన నాటి నుంచి దీపావ‌ళి వేడుక‌ల‌ను సైనికుల‌తో జ‌రుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా ఈ సంప్రాదాయాన్ని పాటించ‌నున్నారు. ప్ర‌తి ఏడాది దీపావ‌ళి రోజున‌ సైనికుల‌ను క‌లిసి వారి గురించి తెలుసుకుంటారు. అలాగే వారికి స్వీట్లు కూడా పంచుతారు.

Read more RELATED
Recommended to you

Latest news