పాకిస్థాన్ కు మోదీ లాంటి నాయకుడు కావాలి.. పాక్ అమెరికన్ వ్యాపారవేత్త

-

భారత ప్రధానిగా మూడోసారీ నరేంద్ర మోదీయే ఎన్నికవుతారని పాక్‌-అమెరికన్‌ వ్యాపారవేత్త సాజిద్‌ తరార్‌ అన్నారు. అలాంటి బలమైన నాయకుడు ఉండటం యావత్ ప్రంచానికి మంచి చేస్తుందని పేర్కొన్నారు. దేశాన్ని ఆయన సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారని కొనియాడారు. పాకిస్థాన్లోనూ సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే ఇలాంటి నాయకుడొకరు రావాలని సాజిద్‌ ఆకాంక్షించారు.

మోదీ అద్భుతమైన నాయకుడు అని సాజిద్ తరార్ అన్నారు. పుట్టుకతోనే మోదీ లీడర్‌ అని, ఆయన నాయకత్వం కేవలం భారత్‌కే కాదు, మొత్తం ప్రపంచానికీ మంచి చేస్తుందని ప్రశంసించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పాకిస్థాన్‌లో పర్యటించి, తన రాజకీయ భవితవ్యాన్ని పణంగా పెట్టిన ఏకైక ప్రధాని అని, తమకూ అలాంటి నాయకుడు రావాలని ఆశిస్తున్నామని కితాబిచ్చారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపి వాణిజ్యం ప్రారంభిస్తారన, శాంతియుత వాతావరణం ఇరుదేశాలకూ మంచిది అని సాజిత్ తరార్‌ అభిప్రాయపడ్డారు. ‘మోదీ ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. 2024లో భారత పురోగతి అత్యద్భుతం. ఆ దేశ విజయాన్ని అందరూ చెప్పుకొంటారు. భవిష్యత్తులో ప్రతిఒక్కరూ భారత ప్రజాస్వామ్యాన్ని చూసి నేర్చుకుంటారు’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news