బిల్డింగ్‌ పైనుంచి ఏసీ పడటంతో యువకుడి మృతి.. వీడియో వైరల్‌

-

ఒక బిల్డింగ్‌ వద్ద ఇద్దరు యువకులు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఉన్నట్టుండి మూడో అంతస్తుపై నుంచి ఏసీ ఊడి స్కూటర్‌పై కూర్చున్న యువకుడి తలపై పడింది. సరిగ్గా తలపై ఏసీ పడటంతో ఒక్కసారిగా అతడు స్కూటర్ పై నుంచి ఎగిరి పడ్డాడు. ఈ ఘటనలో ఆ యువకుడు మరణించాడు.

ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన ఆ సమీపంలోని సీసీటీవీలో రికార్డయింది. దిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 17వ తేదీన దిల్లీలోని కరోల్ బాగ్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్కన ఉన్న యువకుడు జస్ట్ సెకన్ లో ఈ ఘటన నుంచి తప్పించుకున్నాడని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ విషాదకర సంఘటన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news