రెప్పపాటులో కాలుజారి.. జలపాతంలో కొట్టుకుపోయిన యువకుడు

-

భారత్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తర, దక్షిణ భారతాలను వరణుడు వణికిస్తున్నాడు. భారీ వర్షాలతో దేశంలోని చెరువులు, నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. జలపాతాలు జలసవ్వడులతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో జలపాతాలు చూడటానికి సందర్శకులు క్యూ కడుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది.

కర్ణాటకలోని ఉడిపి జిల్లా కొల్లూర్​లోని అరశినగుండి జలపాతాన్ని చూడటానిరి శివమొగ్గ జిల్లా భద్రావతి ప్రాంతానికి చెందిన శరత్​ కుమార్​(23) కారులో వెళ్లాడు. జలపాతాన్ని వీక్షించేందుకు అక్కడ ఓ బండపై నిలబడగా.. దీనిని అతడి స్నేహితుడు ఫోనులో వీడియో తీశాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయాడు శరత్. కాలు జారి పడిపోతున్న దృశ్యం మొబైల్​లో రికార్డు అయ్యింది. సమాచారం అందుకున్న కొల్లూర్ పీఎస్ఐ జయలక్ష్మి, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. జలపాతంలో కొట్టుకుపోయిన శరత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొల్లుర్ పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news