విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు జెడ్ కేటగిరి భద్రత

-

రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రత కల్పించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపపక్షాల అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా కు కేంద్ర హోంశాఖ సిఆర్పిఎఫ్ సాయుధ కమెండోల రక్షణ కల్పించింది. యశ్వంత్ సిన్హా ఈ నెల 27న నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు తన నామపత్రాలను సమర్పించనున్నారు.

కాంగ్రెస్, ఎన్సీపీ, టిఎంసి, సమాజ్వాదీ పార్టీ సహా 22 పార్టీలు సిన్హాకు మద్దతు తెలిపాయి. కాగా అధికార ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది మూర్ముని ప్రకటించింది. ఆమె నేడు నామినేషన్ వేయనున్నారు. పీఎం మోడీ.. ముర్ము పేరును ప్రతిపాదించనున్నారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తో పాటు కేంద్ర మంత్రులు, పలువురు మంత్రులు పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news