Breaking : మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు నోటీసులు

-

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న హీరో నవదీప్‌ విచారణకు హాజరుకావాలని నార్కోటిక్‌ బ్యూరో నోటీసులు జారీ చేసింది. 41 A కింద నోటీసులు జారీ చేసిన నార్కోటిక్ అధికారులు శనివారం (సెప్టెంబర్‌ 23)న విచారణకు రావాలంటూ ఆదేశించారు. కాగా ఇటీవల మాదాపూర్ పోలీసులు నిర్వహించిన రైడ్‌లో మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

Navadeep: ఆ స్టార్ హీరో కూతుర్ని ప్రెగ్నెంట్ చేసిన నవదీప్.. అందుకే అవకాశాలు  రావట్లేదా..-Navadeep: ఆ స్టార్ హీరో కూతుర్ని ప్రెగ్నెంట్ చేసిన నవదీప్ ...

మాదాపూర్‌లోని ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఫ్లాట్‌లో 2023 ఆగస్టు 31న జరిగిన డ్రగ్‌ పార్టీ తీగ లాగిన టీఎస్‌ నాబ్‌ అధికారులు మరో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నైజీరియన్లతో పాటు టాలీవుడ్‌కు చెందిన వాళ్లు ఉన్నారు. ఈ కేసులో పట్టుబడిన రామ్‌చంద్‌ విచారణలోనే నటుడు నవదీప్‌ పేరు వెలుగులోకి వచ్చింది. రామ్‌చంద్‌ తన వాంగ్మూలంలో నవదీప్‌ సైతం తనతో కలిసి మాదకద్రవ్యాలు సేవించినట్లుగా వెల్లడించాడు. ఎక్కడికి నుంచి ఎక్కడికి వచ్చాయనే కోణంలో 23న విచారణ చేపట్టనున్నారని తెలుస్తోంది. నవదీప్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. నవదీప్ స్నేహితుడు రాంచంద్ తో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news