ఎట్టకేలకు బాలయ్య నర్తనశాల రిలీజ్.. ఎప్పుడంటే ?

-

అదేంటి బాలయ్య నర్తనశాల సినిమా ఇప్పుడు రిలీజ్ కావడ ఎంటి ? ఆ సినిమా పూర్తికాలేదు కదా అనుకుంటున్నారా ? అయితే నిజమే ఆయన దర్శకత్వంలో తెరకెక్కాల్సిన నర్తనశాల సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆ సినిమాలో కొన్ని నిముషాలు షూట్ చేశారు. ఇప్పుడు దానినే రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా బాలయ్య ప్రకటించారు. ఆయన ఫేస్ బుక్ లో రాసుకున్న పోస్ట్ యధాతథంగా “నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి నర్తనశాల. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే.ఎంతో కాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలన్న ఆసక్తిని చూపిస్తున్నారు.

మీ అందరి కోరికపై ఈ నర్తనశాల చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. అర్జునుడిగా తాను, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు గారు కనిపిస్తామనీ ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఎన్నాళ్ళనుండో నర్తనశాల సన్నివేశాలను చూడాలన్న మీ కోరిక ఈ నెల 24 న నెరవేరబోతోం దని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news