ఎన్సీబీ అధికారి కేపీఎస్ మల్హోత్రా కరోనా..!

-

ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరిగి చివరకు డ్రగ్స్ మాఫియా బయటపెట్టేందుకు దారి తీసిన సంగతి అందరికీ విదితమే. ఈ తరుణంలో బాలీవుడ్ హీరోయిన్లు, టాలీవుడ్ హీరోయిన్లకు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ను విచారణ చేసిన NCB అధికారి కెపిఎస్ మల్హోత్ర కి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈయన ప్రస్తుతం సుశాంత్ రాజ్ పుత్ సింగ్ ఆత్మహత్య కేసుతో పాటు డ్రగ్స్ కేసు కు సంబంధించి విచారణ చేపడుతున్నారు.

దీపిక పదుకొనె, శ్రద్ధ కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ఈ కేసులో కూడా NCB విచారణ చెప్పటింది. అంతేకాకుండా ఈ కేసుతో సంబంధం ఉన్న మరి కొంతమందిని విచారణ జరిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏదిఏమైనా ఒక వ్యక్తి ఆత్మహత్య కేసు చివరకు… అన్ని సినీ వర్గాలలో డ్రగ్స్ కలకలం రేపింది.

Read more RELATED
Recommended to you

Latest news