నీట్‌ ఫలితాలు రిలీజ్ : చెక్ చేసుకోండిలా !

-

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష -నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్‌) ఫలితాలు వెల్లడయ్యాయి. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌ అయిన ntaneet.nic.inలో రిజల్ట్స్‌ ని చెక్ చేసుకోవచ్చు. ఇక సెప్టెంబర్‌ 13 న జరిగిన నీట్‌ పరీక్షా ఫలితాలు షెడ్యూల్‌ ప్రకారం సోమవారమే విడుదల కావాల్సి ఉండగా సుప్రీం కోర్టు ఆదేశాలతో జాప్యం అయ్యాయి.

వాటిని ఈరోజు రిలీజ్ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా, కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉండిపోవడం వల్ల పరీక్ష రాయలేకపోయిన వారి కోసం ఈ నెల 14వ తేదీన మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చారు. ఈ సారి నీట్‌ ద్వారా దేశ వ్యాప్తంగా 13 ఎయిమ్స్‌ లతో పాటు, జవహర్‌ లాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ – పుదుచ్చేరిలోనూ ఎంబీబీఎస్‌ కోర్సులో ప్రవేశాలు జరపనుంది నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ.

Read more RELATED
Recommended to you

Latest news