నేతాజీ స్ఫూర్తిని నవతరం అందిపుచ్చుకోవాలి – పవన్ కళ్యాణ్

-

ఆజాద్ హింద్ పౌజ్ వ్యవస్థాపకులు, ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. నేతాజీ స్ఫూర్తిని నవతరం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నవతరంలో సామాజిక స్పృహను పెంపొందించేందుకు జనసేన చేపట్టే కార్యక్రమాలపై నేతాజీ ఆలోచనల ప్రభావం ఎప్పుడూ ఉంటుందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

” దేశాన్ని దాస్య శంకరాల నుంచి విముక్తి చేసేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం ప్రతి తరాన్ని జాగృతం చేస్తుంది. నేతాజీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి సభక్తికంగా అంజలి ఘటిస్తున్నాను. పిరికి మాటలు మాట్లాడకండి.. వినకండి. అవి మీ జీవిత గమనానికి ఆటంకమవుతాయి. ఎదుటి వారికి పిరికితనం నూరిపోస్తే మీరు పిరికివారు అవుతారు అని ఉత్తేజితం చేసిన ఆ యోధుని స్ఫూర్తి వచనాలను నవతరం అందిపుచ్చుకోవాలి. మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై గొంతు వినిపించడంలో అధైర్యం వదిలి మాట్లాడిన రోజున ఖచ్చితంగా పాలకుల వైఖరి మారుతుంది. నవతరంలో సామాజిక స్పృహను పెంపొందించేందుకు జనసేన చేపట్టే కార్యక్రమాలపై నేతాజీ ఆలోచనల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది” అన్నారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news