ఎన్నికల ఎఫెక్ట్ : బయటపడ్డ కొత్త రకం డ్రగ్

-

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కొనసాగుతున్న తనిఖీల్లో కొత్తరకం డ్రగ్ పట్టుబడింది. మత్తు కోసం వినియోగించే హాషిశ్ ఆయిల్ ను తరలిస్తుండగా డ్రగ్ డీలర్ ఒకరు పట్టుబడ్డారు. లీటర్ లక్ష రూపాయలకు వైజాగ్ ఏజెన్సీ నుంచి కొనుగోలు చేసి నగరానికి తీసుకొస్తుండగా ఆయన పట్టుబడినట్టు చెబుతున్నారు. మణికొండకు చెందిన లక్ష్మీపతి ఈ బ్లాగ్ బిజినెస్ చేస్తున్నట్లు గుర్తించారు.

Drugs
Drugs

హాషిశ్ ఆయిల్ ను తీసుకొని వచ్చి అందులో ఐసో ప్రోపైల్ ఆల్కహల్ ను లక్ష్మీపతి కలుపుతున్నట్టు గుర్తించారు. ఆ ఆయిల్ ను చిన్న చిన్న ప్యాకెట్లు రూపంలో తయారు చేసి ప్యాకెట్ మూడు వేలకు అమ్ముతున్నట్టు గుర్తించారు. సిగిరెట్ తాగే టప్పుడు హాషిశ్ ఆయిల్ రెండు చుక్కలు వేసుకుని తాగితే విపరీతమైన నిషా వస్తోందని అంటున్నారు. హయత్ నగర్ పెద్ద అంబర్ పేట్ వద్ద వాహనాల తనిఖీల్లో లక్ష్మీపతి పట్టుబడినట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.  

Read more RELATED
Recommended to you

Latest news