`వైఎస్సార్ పెన్షన్ కానుక` పథకానికి అర్హతలు ఇవే..!

-

రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్‌ అందజేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ‘వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’ పథకంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా ఫించను పెంచిన జగన్… పింఛను అర్హత వయసును కూడా తగ్గించింది. పింఛనును రూ.2250లకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన తొలి హామీకి సంబంధించి జీవోను కూడా విడుద‌ల చేసింది. అయితే తాజాగా ఏపీలో వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి.. ఇది వరకు జారీ చేసిన జీవోలో పేర్కొన్న కొన్ని అర్హత నిబంధనలను సవరించి సరికొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది ఏపీ ప్ర‌భుత్వం.

వైయస్సార్‌ పెన్షన్‌ కానుక లబ్ధిదారుల ఎంపికకు నిర్ధారించిన అర్హతలు:

– గ్రామీణ ప్రాంతాల వారికి ప్రతి నెలా రూ 10 వేలు, పట్టణ ప్రాంతాలలో రూ12 వేల లోపు నెలసరి ఆదాయం కలిగి ఉండాలి.
– నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల లోపు తరి, లేదా పది ఎకరాల మెట్ట, లేదా రెండూ కలిపి పది ఎకరాలలోగా కలిగి ఉండాలి.
– టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయించి నాలుగు చక్రాల వాహనాలు ఉండరాదు.
– కుటుంబంలో పెన్షనర్‌ గానీ ప్రభుత్వ ఉద్యోగి గానీ ఉండరాదు.
– ప్రతి నెలా కరెంటు వినియోగం 300 యూనిట్లకు మించరాదు.కుటుంబంలో ఆదాయం పన్ను చెల్లించే సభ్యులు ఉండరాదు.
– కుటుంబంలో ఒక్కరికే పెన్షన్‌ కానుకకు అర్హులు. ఐతే 80 శాతం అంగవైకల్యం గల దివ్యాంగులు, డయాలసిస్‌ పేషంట్లు, మానసికంగా తీవ్రంగా బాధ పడుతోన్న వారు ఫ్యామిలీలో ఉంటే.. వారికి కూడా పింఛన్‌ లభిస్తుంది.

ఆయా కెటగిరీల వారీగా అర్హతలు:

– 60 సంవత్సరాల వయసు పైబడిన నిరుపేదలు
– ఎస్సీ కేటగిరీకి చెందిన వారి వయసు 50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉండాలి.
– 18 ఏళ్లు దాటిన వితంతువులు. చనిపోయిన భర్త గురించి ధృవీకరణ పత్రం విధిగా ఉండాలి.
– దివ్యాంగులకు నో ఏజ్‌ లిమిట్‌. అయితే 40 శాతం పైగా దివ్యాంగులుగా ఉండాలి.
– 50 సంవత్సరాలు పై బడిన చేనేతలు. చేనేత శాఖ నుంచి ధృవీకరణ పత్రాన్ని విధిగా సమర్పించాలి.
– 50 సంవత్సరాల పైబడి వయసు కలిగిన గీతకార్మికులు. ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
– ఆరు నెలలుగా యాంటీ రాట్రో వైరల్‌ తెరపీ ట్రీట్‌మెంటు తీసుకునే వారు కూడా పథకానికి అర్హులు.
– ప్రతి నెలా ఆసుపత్రిలో డయాలసిస్‌ చేసుకుంటున్న రోగులు.

– 18 సంవత్సరాల వయసు పైబడిన ట్రాన్స్‌జెండర్లు. వైద్య శాఖ సర్టిఫికె ట్‌ విధిగా కలిగి ఉండాలి.
– మత్స్య శాఖ నుంచి సర్టిఫికెట్‌ పొందిన 50 సంవత్సరాల పైబడిన మత్స్యకారులు.
– వివాహమై విడిపోయిన ఒంటరి మహిళలు. 35 సంవత్సరాల వయసు పై బడి, తరువాత విడిపోయిన మహిళలు, ఏడాది పాటు సెపరేషన్‌గా ఉన్న మహిళలు, 30 సంవత్సరాల వయసుండి వివాహం కాని వారు.
– 50 సంవత్సరాల పైబడి వయసున్న డప్పు కళాకారులు. సంక్షేమ శాఖ ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలి.
– 40 సంవత్సరాల వయసున్న చర్మకారులు.
– తలసేమిమా, సికిల్‌ సెల్‌ డిసీజ్, మేమోఫీలియా వ్యాధిగ్రస్థులు
– వీల్‌ చేర్‌కే పరిమితమైన పెరాలిసిస్‌ రోగులు, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు, మస్కులర్‌ డైస్ట్రోఫీ వ్యాధిగ్రస్థులు, క్రానిక్‌ కిడ్నీ పేషెంట్లు.

Read more RELATED
Recommended to you

Latest news