తెలుగులో కొత్త ఓటీటీ.. దసరాకి వచ్చేస్తోంది.

-

లాక్డౌన్ పుణ్యమా అని ఓటీటీ వేదికలకి డిమాండ్ బాగా పెరిగింది. కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతపడటంతో వినోదమంతా ఓటీటీలకే పరిమితమైపోయింది. ఈ నేపథ్యంలో ఓటీటీలు కొత్త కొత్త కంటెంట్ ని ప్రేక్షకుల ముందు ఉంచుతున్నారు. ఓటీటీకి డిమాండ్ పెరుగుతున్న కారణంగా కొత్త ఓటీటీ వేదికలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో రెండు మూడు కొత్త వేదికలు మొదలు కాబోతున్నాయి. తాజాగా ఫిలిమ్ అనే వేదిక మొదలు కాబోతుంది.

ఉత్సాహవంతులైన వ్యాపారస్తులు ఈ వేదికని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఫిలిమ్ అని పేరు కూడా అనౌన్స్ చేసారు. ఫిలిమ్ లో తమ మొదటి సినిమాగా విజయ్ సేతుపతి నటించిన పిజ్జా 2 ఉండబోతుంది. వెబ్ సిరీస్ లతో పాటు కొత్త కొత్త సినిమాలని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వేదిక దసరా నుండి ప్రేక్షకులకి అందుబాటులో ఉండనుందట. కొత్త ఫ్లాట్ ఫామ్ కాబట్టి ప్రేక్షకులని ఆకర్షించడానికి అతి తకువ ధరకే సబ్ స్క్రిప్షన్ ఇవ్వనున్నారట. మొత్తానికి తెలుగులో ఓటీటీ ల మధ్య పోటీ మొదలైందన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news